సౌత్ హీరోయిన్ సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ మధ్య విబేధాలు నెలకొన్నాయని, ఇద్దరి మధ్య పచ్చగట్టి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందని ఇటీవల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పటికే సాయి పల్లవిపై పొగరుబోతు అనే నింద ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. సాయి పల్లవి ఏ సినిమాలో నటించినా తన కోస్టార్లను డామినేట్ చేసే ప్రయత్నం చేస్తుందని, ఆమె వల్ల హీరోలు కూడా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. 'NGK' మూవీలో కలిసి నటిస్తున్న ఈ హీరోయిన్ల మధ్య గొడవలు రావడానికి సాయి పల్లవి యాటిట్యూడ్ కారణమనే రూమర్స్ తెరపైకి వచ్చాయి.
‘NGK' మూవీలో తన పాత్రే హైలెట్ అవ్వాలని భావించి సాయి పల్లవి... దర్శకుడి వద్ద ముందే ఈ విషయమై మాట తీసుకుందని, రకుల్కు సంబంధించిన కొన్ని సీన్లను కట్ చేయించిందని, తద్వారా సినిమాలో తన పాత్ర డామినేషన్ ఉండేలా జాగ్రత్త పడిందనే రూమర్స్ తెరపైకి వచ్చాయి.ఈ వార్తలపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. సాయి పల్లవి అలా చేసిందంటే తాను నమ్మడం లేదని, ఆమె చాలా మంచి అమ్మాయి, ఇతరుల వర్క్ విషయంలో జోక్యం చేసుకునే మనిషి కాదని తెలిపారు. అలాంటి వార్తలను కేవలం పుకార్లుగానే చూస్తానని తెలిపారు.
సాయి పల్లవితో నాకు సినిమాలో రెండు సీన్లు మాత్రమే ఉన్నాయి. ఇద్దరం బాగా చేశాం. నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. దర్శకుడు సెల్వరాఘవన్ నాకు మంచి రోల్ ఇచ్చారు. నిడివి కూడా ఎక్కువే. ఈ విషయంలో వస్తున్న రూమర్స్ నిజం కాదు. దర్శకుడు నాకు కథ చెప్పే సమయంలో ఏం చెప్పారో అదే షూట్ చేశారు అని రకుల్ తెలిపారు.సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రూపొందుతున్న చిత్రం 'ఎన్.జి.కె'. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ విడుదల చేస్తున్నారు. సినిమా మే 31న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa