మాలీవుడ్లో హేమ కమిటీ రిపోర్ట్ సంచలనం సృష్టిస్తోంది. ఆ ప్రభావం అన్ని చిత్ర పరిశ్రమలపైనా పడింది. ఇప్పుడు మహిళలు ఒక్కొక్కరుగా గొంతెత్తి తమ సమస్యలను బయటపెడుతున్నారు. స్టార్లు సైతం ఈ విషయంపై స్పందించారు. తాజాగా నటి రాధిక హేమ కమిటీ రిపోర్ట్ గురించి మాట్లాడారు. మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా చాలా ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. కొంతమంది వ్యక్తులు నటీమణుల కారవాన్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించిన సందర్భాలున్నాయని ఆమె ఆరోపించారు. ‘‘చిత్ర పరిశ్రమలో మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడం దురదృష్టకరం. 46 ఏళ్ల నుంచి నేను ఈ పరిశ్రమలో ఉన్నా. అన్నిచోట్లా ఇదే విధమైన సమస్యలు మహిళలకు ఎదురవుతున్నాయని నా భావన. ఒక సినిమా చిత్రీకరణలో భాగంగా కేరళ వెళ్లినప్పుడు చోటుచేసుకున్న ఘటనను ఎప్పటికీ మర్చిపోను. షాట్ ముగించుకుని నేను వెళ్తుండగా.. సెట్లో కొంతమంది మగవాళ్లు ఒకచోట కూర్చొని ఫోన్లో ఏదో చూస్తు నవ్వుకుంటున్నారు. ఏదో వీడియో చూస్తున్నారని అర్థమైంది. చిత్ర బృందానికి సంబంధించిన ఒక వ్యక్తిని పిలిచి.. ఏం చూస్తున్నారని అడిగా. కారవాన్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. మహిళల ప్రైవేటు వీడియోలు చిత్రీకరించి వాటిని ఫోన్లో చూస్తున్నారని తెలిసింది. ఈ విషయంపై చిత్ర బృందానికి ఫిర్యాదు చేశా. కారవాన్లో ఏమైనా కెమెరాలు పెడితే తగిన బుద్థి చెబుతానని ఆ టీమ్కు వార్నింగ్ ఇచ్చా. ఆ ఘటన తర్వాత నాకు కారవాన్ ఉపయోగించాలంటే భయం పట్టుకుంది. దుస్తులు మార్చుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం చేయడానికి.. ఇలా పలు వ్యక్తిగత పనులకు సెట్లో అదే మా ప్రైవేట్ ప్లేస్’’ అని రాధిక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa