ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాట్ టాపిక్ గా మారిన శృతి హాసన్ రెమ్యునరేషన్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 10, 2019, 01:36 PM

'బలుపు' లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. శృతి హాసన్ హీరోయిన్. కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆమెకు ఇది కంబ్యాక్ మూవీగా అంతా చర్చించుకుంటున్నారు. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమాకు శృతి హాసన్ డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అయింది. తనకు రూ. 1.5 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే అని భీష్మించుకుని కూర్చుందట. ఈ విషయంలో ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ అంశంపై ఓ క్లారిటీ రానుంది.


ఒక వేళ శృతి హాసన్ పేమెంట్ విషయంలో తగ్గకపోతే మరో హీరోయిన్ కోసం ప్రయత్నించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఈ చెన్నై బ్యూటీ తెలుగులో చివరగా 2017లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'కాటమరాయుడు' మూవీలో నటించింది. ఆ మూవీ ప్లాప్ కావడంతో ఇక్కడ అవకాశాలు లేకుండా పోయాయి. దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. సెప్టెంబర్లో ఈ మూవీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. వరుస ప్లాపుల్లో ఉన్న రవితేజ ఈ కథపై పూర్తి నమ్మకంగా ఉన్నారట. తమది హిట్ కాంబినేషన్ కావడం కూడా కలిసొచ్చే అంశం. ప్రస్తుతం మాస్ మహరాజ్ 'డిస్కోరాజా' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వి‌ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రవితేజతో 'నేల టిక్కెట్' మూవీ చేసిన రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ్‌పుత్, నభా నటేష్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa