తెలుగు రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఆసక్తితో ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ టాక్ షో 'అన్స్టాపబుల్ సీజన్ 4' వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఇప్పటికే ఈ షో మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తికాగా..ఇప్పుడు నాలుగో సీజన్ శుక్రవారం రాత్రి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ షోను అస్సలు మిస్ అవ్వకండి.బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ అన్స్టాపబుల్ షో ఈరోజు రాత్రి 8.30 నిమిషాలకు ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సీజన్ లెజెండరీ నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణం 50 సంవత్సరాల స్మారక వేడుకను జరుపుకోవడంతోపాటు మరింత ప్రత్యేకం కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమోలకు భారీ రెస్పాన్స్ వచ్చింది.ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ షోలో తమ సినీ ప్రయాణం, వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నారు. గతంలోనే టీడీపీ అధినేత ప్రతిపక్ష హోదాలో ఈ షోలో పాల్గొని తన రాజకీయ జీవితం, పర్సనల్ విషయాల గురించి మాట్లాడారు. ఇక ఇప్పుడు సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈరోజు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అన్స్టాపబుల్ టాక్ షో మొదటి ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడుతో ప్రారంభంకానుంది. ఇప్పటికే విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమోలకు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్నామంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు"ఇది బాలయ్య పండుగ" అనే టైటిల్తో ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాలయ్యతో కలిసి అనేక విషయాలను పంచుకున్నారు. రాజకీయ జీవితం.. ప్రతిపక్ష హోదా.. గత సంవత్సరం రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో అతను ఎదుర్కొన్న సవాళ్ల గురించి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తనకున్న అనుబంధం గురించి చంద్రబాబు ప్రస్తావించడం మరింత ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లు జనాల మనసులలో ఉన్న ఎన్నో ప్రశ్నలకు చంద్రబాబును అడిగి సమాధానాలు తెలుసుకున్నారు బాలయ్య. తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు, టీడీపీ కార్యకర్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ షో ఈరోజు రాత్రి స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa