కోయిలమ్మ, గుప్పెడంత మనసు, పడమటి సంధ్యారాగం వంటి సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సాయి కిరణ్ తాజాగా రెండో వివాహం చేసుకున్నారు. తన తోటి నటి స్రవంతిని ఆయన వివాహమాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. కాగా, వీరిద్దరూ కోయిలమ్మ సీరియల్లో కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడిన ఈ జంట ఇప్పుడు భార్యభర్తలుగా ఒకటైయ్యారు.దిగ్గజ గాయని పి.సుశీలకు.. సాయికిరణ్ మనవడు వరస అవుతాడు. ఇతడి తండ్రి సింగర్. అలా ఇండస్ట్రీ వాతావారణంలోనే పెరగడంతో 'నువ్వే కావాలి' మూవీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. కాకపోతే ఎక్కువగా సినిమాలు చేయలేకపోయారు. కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్నారు. గతంలోనే వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా.. వీళ్లకు ఓ పాప కూడా ఉంది.మనస్పర్థలు కారణంగా కొన్నాళ్ల క్రితమే సాయికిరణ్-వైష్ణవి విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్న సాయికిరణ్.. కొన్నాళ్ల క్రితం తనతోపాటు 'కోయిలమ్మ' సీరియల్లో నటించిన స్రవంతితో ప్రేమలో పడ్డాడు. ప్రేమకాస్త ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఇప్పుడు భార్యభర్తలయ్యారు. ఈ క్రమంలోనే పలువురు సీరియల్ నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa