ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన మిస్ మ్యాచ్ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను గురువారం హీరో విక్టర్ వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజర్ ప్రత్యేకంగా తను చూసానని చాలా ఆసక్తికరంగా ఉందని, ఈ చిత్రం కూడా విజయవంతమవుతుందని ఆశిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్కు శుభాకాంక్షలు తెల్పుతూ, వారి కృషికి తగిన ఫలితం దక్కుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ ఈ చిత్రం కోసం మొత్తం యూనిట్ చాలా కష్టపడి పనిచేసిందని, దీనికి గొప్ప నిర్మాణ విలువలు ఉన్నాయని అన్నారు. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని, మంచి వాచ్ కోసం తయారు చేస్తామని నిర్మాత శ్రీరామ్ చెప్పగా, ఆసక్తికరమైన కథాంశం కుటుంబ ప్రేక్షకులతో కనెక్ట్ అవుతుందని రచయిత భూపతి రాజు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎన్వి నిర్మల్ వెంకటేష్కు కృతజ్ఞతలు తెలియ జేస్తూ ఈ చిత్రంలో అనేక ఆసక్తికర విషయాలతో రూపొందించానని, త్వరలో విడుదల చేస్తామని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa