బాలీవుడ్ నటి, ఐటమ్ బాంబ్ ఊర్వశి రౌతేలా మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తెలుగులో 'వాల్తేరు వీరయ్య', 'స్కంద' వంటి చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తించి గుర్తింపు పొందిన ఈమె, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఉత్తర భారతదేశంలో తన పేరు మీద ఒక గుడి ఉందని, అదే విధంగా దక్షిణాదిలో కూడా అభిమానులు తనకు గుడి కట్టాలని కోరుకుంటున్నానని ఆమె పేర్కొనడం వివాదానికి దారితీసింది.ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ, "నార్త్ ఇండియాలో నా పేరు మీద ఒక గుడి ఉంది. బద్రీనాథ్ టెంపుల్ పక్కన ఉన్న ఊర్వశి టెంపుల్ నా కోసం కట్టారు. అలాగే టాలీవుడ్లో చిరంజీవి సినిమాతో ఎంట్రీ ఇచ్చి, వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడంతో నాకు ఇక్కడ కూడా అభిమానులు ఏర్పడ్డారు. ఉత్తరాదిలో లాగే దక్షిణాదిలో కూడా నా అభిమానులు గుడి కట్టాలని కోరుకుంటున్నాను," అని అన్నారు.ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమె ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు ఆమె వ్యాఖ్యలు అతిశయోక్తిగా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా 'తనకు గుడి కట్టాలి' అని కోరడంపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది.గతంలో కూడా ఊర్వశి రౌతేలా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. తాను నటించిన సినిమా వంద కోట్లు వసూలు చేసిందని, అదే సమయంలో విడుదలైన కియారా అద్వానీ సినిమా ఫ్లాప్ అయిందని ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా గుడికి సంబంధించిన వ్యాఖ్యలతో ఆమె మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa