ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డు గెలుచుకున్న డ్రామా 'ముత్తయ్య' OTT ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ లో మే 1న విడుదల కావడానికి సన్నద్ధమవుతోంది. ఈ చిత్రంలో కె సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించారు. భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం యొక్క ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బోమ్మా ప్రధాన పాత్రల్లో ఉన్నారు. ఈ చిత్రాన్ని హై లైఫ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఫిక్షన్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్స్ ఆధ్వర్యంలో వంశి కరుమాంచి మరియు బృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. సినిమాటోగ్రాఫర్ దివాకర్ మణి ఈ చిత్రాన్ని సహ-నిర్మాతతో పాటు కెమెరాను నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa