కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'కాంతార చాప్టర్-1'. 2022లో వచ్చిన ‘కాంతార’కు ప్రీక్వెల్గా ఈ మూవీ సిద్ధమవుతోంది. రిషబ్ స్వీయ దర్శకత్వంలో ముస్తాబవుతోన్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో '27 డేస్ టూ గో' అంటూ కొత్త వీడియోను చిత్రబృందం షేర్ చేసింది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను డూప్ ఉపయోగించకుండా ఎంతో రిస్క్ చేసి రిషబ్ స్వయంగా చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa