by Suryaa Desk | Mon, Aug 12, 2024, 07:41 PM
సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మానువాడ వద్దగల శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి ఇల్లంతకుంట మండలంలోని గ్రామాలకు మిడ్ మానేరు కుడికాలువ ద్వారా నీటిని విడుదల చేయాలంటూ సోమవారం ఇల్లంతకుంటలో రైతులు రాస్తారోకో, ధర్నా చేస్తున్నారు. కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. నీటిని విడుదల చేసే వరకు రాస్తారోకో విరమించేది లేదంటూ రోడ్డుపై బైఠాయించారు.