by Suryaa Desk | Tue, Aug 13, 2024, 10:48 AM
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల మన దుర్గా భవాని అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం మంగళవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.