తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. నేడు సాయంత్రం ప్రచార పర్వానికి తెర పడనుంది. ప్రచార గడువుకు కొద్ది గంటల సమయం మాత్రమే ఉండటంతో నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రోడ్ షోలు, స్ట్రీట్ కార్నర్ మీటింగులతో ప్రజల్ని ఆకట్టునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎన్నికల సంఘం కూడా పోలింగ్కు ఏర్పాట్లు చేసింది. ఈనెల 13న పోలింగ్ జరగనుండగా.. దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని ఎన్నికల సంఘం అవగాహన కల్పిస్తోంది. సెలబ్రెటీలతో స్పెషల్ వీడియోలు కూడా చేయించారు.
తాజాగా.. హైదరాబాద్లోని ప్రముఖ ఏఐజీ హాస్పిటల్ ఛైర్మన్, చీఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు నాగేశ్వర్ రెడ్డి ఓటు శాతం పెంచేందుకు వినూత్నంగా ఆలోచించారు. ఓటు హక్కు వినియోగించుకున్న వారికి ఫ్రీ కన్సల్టెన్సీ అని బంపరాఫర్ ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో మే 13న జరిగే పోలింగ్ రోజున ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికీ తమ ఆసుపత్రిలో ఫ్రీ కన్సల్టెన్సీ ఉంటుందని చెప్పారు. అలాగే లేబొరేటరీ పరీక్షల్లో 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఓటు వేసి హాస్పిటల్కి వచ్చి సిరా ఇంక్ గుర్తు చూపించి ఈ సదుపాయం పొందాలని సూచించారు. పోలింగ్ రోజున సాయంత్రం 6 గంటల వరకు ఈ అవకాశం ఉంటుందని ఆయన ఓటర్లకు వెల్లడించారు.
ఆదివారం కూడా ఓటర్లను కలవొచ్చుఇక నేడు సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుండగా.. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గడువు ముగిసిన తర్వాత కూడా ప్రచారం చేసుకోవచ్చునని చెప్పారు. అయితే పబ్లిక్గా కాదని.. ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించవచ్చునని అన్నారు. బ్యాండు, బారీ లౌడ్ స్పీకర్లు, జనంతో కాకుండా ఐదు నుంచి పది మందితో ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకోవచ్చునని వెల్లిడించారు. అభ్యర్థులే కాకుండా ఎక్కడికక్కడ నాయకులు, కార్యకర్తలూ ప్రచారం చేయవచ్చునని చెప్పారు. కాకపోతే పరిమిత సంఖ్యలో మాత్రమే వెళ్లాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa