ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజులు వానలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 09:28 PM

తెలంగాణలో గతకొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొని ఉంది. గత వారం క్రితం వరకు ఎండలు దంచికొట్టగా.. నాలుగైదు రోజులుగా వాతావరణం చల్లబడింది. తమళనాడు మీదుగా ఆవిరించిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా.. తెలంగాణలో వర్షాలపై భారత వాతావరణ కేంద్రం హైదరాబాద్ శాఖ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు. ద్రోణి ప్రభావంతో ఈనెల 15 వరకు వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు.


నేడు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, మెదక్‌, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో అక్కడకక్కడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా.. శుక్రవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో 6.8 సెం.మీ వర్షం కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సత్తుపల్లిలో 5.1 సెం.మీటర్లు, మెదక్‌ జిల్లా శంకరంపేటలో 4.7 సెం. మీటర్లు, నిర్మల్‌ జిల్లా దస్తూరాబాద్‌లో 3.8 సెం.మీటర్లు, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్లలో 3.7 సెం.మీటర్ల వర్షం కురిసింది.


భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, వనపర్తి, కామారెడ్డి, ఆదిలాబాద్‌, వికారాబాద్‌ జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు కురిశాయి. మరోవైపు నిజామాబాద్‌ జిల్లా జకోరాలో 43.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. కాగా,ఈనెల 13న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఉండగా.. ఆ రోజు కూడా వర్ష సూచన ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. వర్షం పోలింగ్‌పై ప్రభావం చూపిస్తుందని భయపడతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa