సార్వత్రిక ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. నేటితో ప్రచార పర్వానికి తెరపడనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదైల నాటి నుంచి పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. నేతలు విమర్శలు, ప్రతివిమర్శలతో మాటల దాడికి దిగుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతుండటంతో ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. తాజాగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు మనిషి అంటూ ఏపీ సీఎం జగన్ కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తే.. ఏపీలో చంద్రబాబును గెలిపించేందుకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందని హాట్ కామెంట్స్ చేశారు.
జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. జగన్ కామెంట్లను సొంత చెల్లి, కన్న తల్లే విశ్వసించటం లేదని అన్నారు. తన బాబాయ్ వివేకానంద రెడ్డి చావు, ఏపీలోని పరిస్థితులపై దృష్టిపెడితే బాగుంటుుందని సూచించారు. తాను ఒకప్పుడు టీడీపీలో కొనసాగానని.. 2017లో ఆ పార్టీని వీడటంతోనే చంద్రబాబుతో తనకు రాజకీయ సంబంధం తెగిపోయిందందన్నారు. వ్యక్తిగతంగా తాము మాట్లాడుకోవచ్చు కానీ.. రాజకీయంగా ఎలాంటి బంధం లేదని చెప్పారు.
తాను ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నానని.. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారని.. ఏపీలో తమ పార్టీ విజయానికి కృషి చేస్తానని చెప్పారు. తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే కన్నా.. రాజకీయ వేదికలపై చర్చకు దారి తీసిన వివేకా హత్య కేసు విషయంపై తన చెల్లికి కుటుంబ సభ్యులకు క్లారిటీ ఇస్తే బాగుంటుందన్నారు. అది వ్యక్తిగతంగా వారి కుటుంబ విషయం అయినా.. ప్రస్తుతం రాజకీయ వేదికలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మిత్రుడు జగన్పై ఉందని కౌంటర్ ఇచ్చారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్లపై ఏపీ సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa