ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ ఉద్యోగులకు రెండ్రోజులు వేతనంతో కూడిన సెలవులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 09:07 PM

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడనుండగా.. ఈనెల 13న పోలింగ్ జరగనుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. కాగా, ఎన్నికల విధుల్లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ జరిగే జూన్ 13న ఎన్నికల సంఘం విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వేతనంతో కూడిన సెలవులను అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.


ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు పోలింగ్ రోజున సెలవులు ఇచ్చారు. కాగా, ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందికి మరుసటి రోజు అంటే మే 14న సెలవు ప్రకటిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సిబ్బందికి మే 14న స్పెషల్ క్యాజువల్ లీవ్ లేదా పెయిడ్ హాలీడేగా గుర్తించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లను ఆదేశించారు. దీంతో వరుసగా రెండ్రోజులు సెలవులు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa