తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం కీలక ఘట్టానికి చేరుకుంది. ఈరోజుతో ప్రచార పర్వం ముగియగా.. మే 13వ తేదీన కీలక ఘట్టమైన పోలింగ్ జరగనుంది. అయితే.. ఉద్యోగరిత్యా చాలా మంది హైదరాబాద్లో నివాసముంటున్న విషయం తెలిసిందే. కాగా.. మే 13న పోలింగ్లో పాల్గొనేందుకు చాలా మంది ఇప్పటికే గ్రామాలకు బయలుదేరారు. అయితే.. కొందరు ఉద్యోగులు మాత్రం కంపెనీల్లో సెలవులు దొరక్కో.. ఆరోజు సెలవు పెడితే జీతం కట్ అవుతుందన్న భయంతోనో.. ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్లకుండా ఉండిపోతున్నారు. అలాంటి ఉద్యోగులను పరిగణలోకి తీసుకుని.. ఎన్నికల సంఘం ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసింది.
పోలింగ్ రోజున.. ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని కంపెనీలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. పోలింగ్ రోజు సెలవు ఇవ్వని సంస్థలపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో.. మే 13న అన్ని కంపెనీలు పెయిడ్ హాలిడేగా ప్రకటించింది. దీంతో.. ఉద్యోగులంతా ఊర్లకు పయనమయ్యారు. జనాలంతా గ్రామాలకు పయనమవటంతో.. ట్రైన్లు, బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా కిక్కిరిసిపోయాయి.
ఇదిలా ఉంటే.. ప్రచార సమయం ముగిశాక నియోజకవర్గాల్లో ఇతరులు ప్రచారాలు చేస్తూ కనిపించకూడదని ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. అంతేకాగు.. జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొన్నారు. పోలింగ్ సమయాల్లో 160 కేంద్ర బలగాలు, 60 వేల మంది రాష్ట్ర పోలీసులు బందోబస్తు విధుల్లో ఉంటారని వెల్లడించారు. కాగా.. పోలింగ్ సమయంలో గుంపులుగా ఎక్కడ చర్చలు కొనసాగించొద్దని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa