తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. శనివారంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇన్ని రోజులు కాళ్లకు చక్రాలు కట్టుకుని రాజకీయ నేతలంతా చేసిన ప్రచారానికి ఫలితంగా.. మే 13వ తేదీన ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. కాగా.. ప్రచారం చివరి రోజు ప్రచారం సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కీలక నేత జగ్గారెడ్డిని ఉద్దేశించి.. ఆసక్తికర కామెంట్లు చేశారు.
తన ముఖ్యమంత్రి పదవినంతా జగ్గారెడ్డే నడుపుతున్నాడని.. ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం పెత్తనం ఆయనదేనని.. తనదేమీ లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. .. తాను కేవలం రబ్బరు స్టాంపునేనని.. గుద్దుమన్న దగ్గర గుద్దుతున్నా.. సతకం పెట్టమన్న దగ్గర పెడుతున్నా అంటూ ఆసక్తికర కామెంట్లు చేశారు. మొత్తం నడుస్తుందే మీదని.. మనోళ్లదని.. పేదోళ్లదని.. పేదోళ్లకు అండగా ఉండేవాళ్లదంటూ చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి.
కాగా.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్లపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి.. ఇలా బహిరంగంగా తాను కేవలం రబ్బరు స్టాంపునేనని.. ఎలాంటి పదవి లేని వ్యక్తి ముఖ్యమంత్రి కార్యలయంలో పెత్తనం చెలాయిస్తున్నాడని చెప్పటమేంటంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఈ విమర్శలపై కాంగ్రెస్ నాయకులు, సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి వివరణ ఇస్తారో.. పోలింగ్ ముగిసేంత వరకు వేచి చూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa