ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 13, 2024, 01:42 PM

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పి చందనా దీప్తి ఐపీఎస్ అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే వారి పట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉన్నందున గుంపులు గుంపులుగా ఐదుగురు కంటే ఎక్కువ మంది తిరగరాదని అన్నారు. సి. విజిల్ యాప్ లో సమస్యలను అప్ లోడ్ చేయుట కానీ డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa