తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల పండుగ నడుస్తోంది. ఉదయం 7 గంటల నుంచే 17 లోక్ సభ సెగ్మెంట్లలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూ కట్టారు. వేసవికాలం కావటంతో.. ఎండలు ముదరక ముందే ఓట్లు వేయాలన్న భావనతో ప్రజలు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో.. ఓ పోలింగ్ కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో ఓ ఉద్యోగి.. గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటని నెహ్రూ నగర్లో చోటు చేసుకుంది.
నెహ్రూ నగర్లో ఏర్పాటు చేసిన 165 పోలింగ్ బూత్లో శ్రీకృష్ణ అనే ఉద్యోగి ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో.. శ్రీకృష్టకు ఒక్కసారిగా గుండెపోటు రావటంతో కుప్పకూలిపోయాడు. ఏమైందని తెలుసుకునేలోపే.. శ్రీకృష్ణ తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ఆగిపోయింది. అధికారులు వెంటనే.. ఆయన మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీకృష్ణ.. కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. విషయం తెలుకున్న అతని కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఎన్నికల విధులు నిర్వహిస్తూ.. తుదిశ్వాస వదలటం అందరినీ కలచివేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa