ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చల్లని రోజున చల్లని పని చేశా.. స్మితా సబర్వాల్ కూల్ ట్వీట్.. నెటిజన్ల కామెంట్లు వేరే లెవల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 13, 2024, 06:04 PM

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకోగా.. రాష్ట్రవ్యాప్తంగా 17 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో.. సీనియర్ ఐఏఎస్ అధికారిణి, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. చల్లని రోజున చల్లని పని చేసేశానంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు.. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఓటు వేసిన ఫొటోను కూడా జత చేశారు స్మితా సబర్వాల్. అయితే.. స్మితా సబర్వాల్ చేసిన పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాము కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నామని కొందరు నెటిజన్లు తమ ఫొటోలను పోస్టు చేస్తున్నారు.


ఇదిలా ఉంటే.. నేటి ఎన్నికలే రేపటి ప్రజల భద్రత అని.. కుటుంబానికి, సమాజానికి, అభివృద్ధికి ఇది అవసరమని.. మీ ఓటు ఇతరులకు విలువైన ఉదాహరణ అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. మరోవైపు... "మేడం.. మీరు చల్లని రోజు చల్లని ఓటు వేశాక.. ఈవీఎం కచ్చితంగా వణికిపోవాల్సిందే.. మంచి వ్యక్తి గెలవాలని కోరుకుంటున్నా.." అంటూ మరో వ్యక్తి ట్వీట్ చేశారు. "మేడమ్ మీరు ఈరోజు మీ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు సంతోషంగా ఉంది. బ్యూరోక్రాట్‌గా మీరు మీ సామాజిక బాధ్యతను నిరూపించుకున్నారు. ఇది.. దేశంలోని, తెలంగాణలోని మీ అనుచరులలో చాలా మందికి స్ఫూర్తిని అందించారు." అంటూ ఇంకో నెటిజన్ కామెంట్ చేశారు.


ఇదిలా ఉంటే.. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియలో చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో.. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌తో పాటు హీరోలు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు సహా పలువరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa