తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటేసేందుకు ప్రజలు పోలింగ్ స్టేషన్ల ముందుబారులు తీరారు. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశఆరు. ఇక పోలింగ్ నిరాటకంగా జరిగేందుకు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
మే 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి.. నేటి సాయంత్రం (మే 13) 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు, బార్లు మూసేయాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వైన్ షాపులతో పాటుగా వివిధ జిల్లాలు, నగరాల్లో బార్లు, కల్లు కాపౌండ్ కూడా మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత రెండ్రోజులుగా మందుబాబులకు మద్యం దొరకటం లేదు. ఇవాళ సాయంత్రం వైన్ షాపులు ఓపెన్ అవుతాయని వారు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇంతలోనే హైదరాబాద్ నగరంలో మందుబాబులకు పోలీస్ కమిషనర్ షాకింగ్ న్యూస్ చెప్పారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైన్ షాపులు, బార్లు తెరవటానికి వీల్లేదని ఉత్తర్వులు జారీ చేశారు. మే 14 ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని చెప్పారు. పోలింగ్ తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ వెల్లడించారు.
కాగా.. ప్రస్తుతం ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపం తీర్చుకునేందుకు మందుబాబులు వైన్స్ ముందు బారులు తీరుతున్నారు. చల్ల చల్లని బీర్లు తాగి వేసవి తాపాన్ని తీర్చుకుందామనుకుంటే ప్రస్తుతం బీర్లు దొరకటం లేదు. అంతలోనే ఎన్నికలు అంటూ వైన్ షాపులు మూసేయటంతో రోజూ తాగుడు అలవాటు ఉన్న మందుబాబులు అల్లాడిపోతున్నారు. ఇక ఫలితాలు వెల్లడయ్యే జూన్ 4న కూడా వైన్ షాపులు బంద్ కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa