హైదరాబాద్ మెట్రో యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. మెట్రో రైలు సమయాల మార్పులపై జరుగుతున్న ప్రచారంపై యాజమాన్యం స్పష్టత ఇచ్చింది. మెట్రో సమయాలను పెంచినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మెట్రో అధికారులు ఖండించారు. మెట్రో సర్వీసులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే నడువనున్నట్టు స్పష్టం చేశారు. అయితే.. ప్రయాణికుల సౌకర్యార్థం ట్రయల్ ప్రాతిపదికన తాము అన్ని శుక్రవారాలు, సోమవారాల్లో మాత్రమే సర్వీస్ వేళలను పొడిగిస్తుంటామని క్లారిటీ ఇచ్చింది.
శుక్రవారం రోజున చివరి రైలు రాత్రి 11 గంటలకు బదులుగా రాత్రి 11.45 నిమిషాలకు బయలుదేరుతుందని.. తద్వారా 45 నిమిషాల పాటు అదనపు సర్వీసు అందించినట్లవుతుందని అధికారులు వివరించారు. సోమవారాల్లో మొదటి రైలు ఉదయం 6 గంటలకు కాకుండా ఉదయం 5.30 సమయంలో బయలుదేరుతుందని పేర్కొన్నారు. తద్వారా అదనంగా 30 నిమిషాల సర్వీసు అందించినట్లవుతుందన్నారు.
అయితే.. ఇది కేవలం ట్రయల్ ప్రాతిపదికన మాత్రమేనని హైదరాబాద్ మెట్రో యాజమాన్యం స్పష్టం చేసింది. ట్రాక్తో పాటు రైళ్ల మెయింటెనెన్స్ షెడ్యూల్ను సర్దుబాటు చేసేందుకు గల అవకాశాలను పరిశీలించిన మీదట, అలాగే డిమాండ్ను బట్టి తుది నిర్ణయం తీసుకోబడుతుందని తెలిపారు. వేళల విషయంలో ఎటువంటి గందరగోళం తలెత్తకుండా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని ప్రయాణికులకు మెట్రో యాజమాన్యం సూచించింది. దీంతో.. రాత్రి వేళ ప్రయాణాలు చేసేవారికి మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయని సంతోషించేలోపు.. యాజమాన్యం ప్రకటన విడుదల చేయటంతో నిరాశకు లోనవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa