ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కారులో టెన్షన్‌ పడుతూ యువకులు.. ఏంటా అని చెక్ చేస్తే అసలు బండారం వెలుగులోకి.

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2024, 08:30 PM

మొన్నటివరకు లోక్ సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. పోలీసులు, భద్రతాబలగాలు ఎక్కడికక్కడ వాహనాలు ఆపి తనిఖీలు చేసేవాళ్లు. ఈ నేపథ్యంలో చాలా మంది స్మగ్లర్లు కొంత మేర సైలెంట్ అయ్యారు. కాగా.. కోడ్ ముగియటంతో మళ్లీ తమ దందాను జోరుగా సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే.. గంజాయిని రకరకాల పద్ధతుల్లో తరలిస్తున్నారు. తాజాగా అక్రమంగా పెద్ద మొత్తంలో తరలిస్తున్న గంజాయిని కొత్తగూడెం పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెం వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని అండర్ బ్రిడ్జ్ వద్ద ఎస్సై విజయ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు.


తనిఖీల్లో భాగంగా.. అటుగా వచ్చిన ఓ కారును పోలీసులు ఆపారు. ఈ సమయంలో కారులో ఉన్న ప్రయాణికులు టెన్షన్ పడుతూ కనిపించారు. దీంతో.. పోలీసులకు అనుమానం వచ్చి.. కారును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో ఏకంగా 93 ప్యాకెట్లలో 186 కేజీల గంజాయి దొరికింది. పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ.75 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.


దీంతో.. కారును, అందులో ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేటకు చెందిన భూక్యా లక్ష్మణ్, పెనుగొండ నరసింహులు, కుంచం లక్ష్మణ్గా గుర్తించారు. ఒరిస్సాలోని మల్కాన్గిరి ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని షోలాపూర్కు గంజాయి తరలిస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa