మంథని మండలం లక్కేపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని తోటగోపయ్యపల్లె, ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో జిల్లెలపల్లిలను నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పాటుకు కృషి చేసిన అప్పటి జడ్పీ చైర్మన్ ప్రస్తుత మంథని బీఆరెస్ నియోజకవర్గ ఇంచార్జ్ పుట్ట మధూకర్ కు మంథని మాజీ జడ్పీటీసి తగరం సుమలత, ముత్తారం మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య, నాయకులు వేగోలపు శంకర్ గౌడ్, తగరం శంకర్ లాల్, పి. కిషన్ రెడ్డి, గుజ్జుల రాజిరెడ్డి, నూనె కుమార్, రవీందర్ రావులు కృతజ్ఞతలు తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం కెసిఆర్ ప్రభుత్వం చిన్న మండలాలు, చిన్న గ్రామపంచాయతీలు ఏర్పాటు చేయగా మంథని, ముత్తారం ఇప్పటికే ఎనిమిది కొత్త గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి.
జిల్లెలపల్లి, తోటగోపయ్యపల్లె గ్రామాల ప్రజలు తమ రెండు గ్రామాలను నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని అప్పటి జెడ్పీ చైర్మన్ ను కోరగా ఆయన ప్రతిపాదనల మేరకు అప్పటి ప్రభత్వం నూతన గ్రామపంచాయతీల ఏర్పాటుకు మార్గం సుగమం చేయగా జూలైలో గెజిట్ నోటిఫికేషన్ వెలువడగా సోమవారం జిల్లేలపల్లి, తోటగోపయ్యపల్లిలను గ్రామపంచాయతీలుగా అధికారికంగా ప్రకటించారు. జిల్లెలపల్లీ, తోటగోపయ్యపల్లి గ్రామాలను నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పాటుకు తమ కోరికను మన్నించి తమ కలను నెరవేర్చిన మాజీ ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్మన్, మంథని బీఆరెస్ నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధుకర్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa