ఎస్సీ ల వర్గీకరణ వ్యతిరేకిస్తూ బుధవారం జరిగే భారత్ బంద్ ను విజయవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర నాయకులు దాసరి దశరథం నూకల బాలయ్య లు పిలుపునిచ్చారు. మంగళవారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ. ఎస్సీల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మాలల వలనే మాదిగ సోదరులకు అన్యాయం జరుగుతున్నట్లు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు మాదిగ సోదరులు వృత్తి ధర్మాన్ని పాటిస్తుండగా.. మాలలంతా చదువుకుంటూ.. రాజకీయ, ఉద్యోగ, ఇతర రంగాల్లో ఉన్నతంగా ఎదుగుతూ వస్తున్నారన్నారు.
మాలలు కేవలం రిజర్వేషన్లు వాడుకొని అభివృద్ధి చెందుతున్నారు అని అనడం సరికాదన్నారు. ఈ క్రమంలో ఎస్పీల వర్గీకరణలో ఇతర సోదర కులాల జనాభాను చూపకుండా మాలలను ఈ గ్రూపులో చేర్చడం పట్ల తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. వర్గీకరణతో దళితుల ఐక్యత విచ్చిన్నమవుతుందన్నారు. వర్గీకరణతో రాజకీయాలు చేయడం సరికాదు. వర్గీకరణ నిలిపి వేసే వరకు ఉద్యమిస్తామన్నారు. బిజెపి మాదిగల మద్దతుగా వర్గీకరణ కోసం కృషి చేయడం సరికాదు. భారత్ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు అప్పల పోచయ్య, జంజర్ల రాజు, ఆర్ల జ్ఞాని, బడికెల నర్సయ్య, సుంకే రామ్మూర్తి, దాసరి గట్టయ్య, కొవ్వూరి వేణు ప్రసాద్, బొడ్డేల ఆనంద్, పోనుగంటి రమేష్, రాదండి శంకర్, జంజర్ల శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa