టాలీవుడ్ నటుడు రాజ్తరుణ్, లావణ్య కేసు కీలక మలుపు తిరిగింది. లావణ్య ఫిర్యాదుతో విచారణ చేపట్టిన హైదరాబాద్ పోలీసులు.. సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. లావణ్య ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయని ఈ మేరకు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇద్దరూ పదేళ్ల పాటు సహజీవనం చేశారని, ఒకే ఇంట్లో కలిసి ఉన్నారని నిర్దారణకు వచ్చారు. ఈ కేసులో రాజ్తరుణ్ను నిందితుడిగా పేర్కొన్న పోలీసులు.. లావణ్య ఇంటిని కూడా సందర్శించి కీలక ఆధారాలను కూడా సేకరించారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్తరుణ్కు కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.
ప్రేమ పేరుతో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాము పదేళ్లుగా కలిసి జీవించామని, ఇప్పుడు ముంబయికి చెందిన హీరోయిన్తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని ఆ మధ్య ఆమె మీడియా ముందుకొచ్చింది. పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ఇందుకు సంబంధించిన పలు ఆధారాలను కూడా ఆమె సమర్పించింది. ఈ క్రమంలో రాజ్ తరుణపై కేసు నమోదుకావడంతో ఆయన ముందస్తు బెయిల్ తీసుకున్నారు. తాజాగా ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో బెయిల్ను రద్దుచేసే అవకాశం ఉంది.
రాజ్ తరుణ్తో తనకి 10 ఏళ్ల కిందటే గుడిలో పెళ్లయిందని లావణ్య తెలిపింది. అంతేకాదు, కొద్ది రోజుల క్రితం తనకి అబార్షన్ కూడా చేయించాడంటూ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆసుపత్రి వివరాలను కూడా పోలీసులకి ఆమె అందజేసింది. అలానే అన్విక పేరుతో రాజ్ తనని విదేశాలకి కూడా చాలా సార్లు తీసుకెళ్లాడని ఆమె చెప్పుకొచ్చింది.
నటి మాల్వీ మల్హోత్రాతో పరిచయం అయిన దగ్గరి నుంచి రాజ్ తరుణ్ తనని దూరం పెట్టాడంటూ లావణ్య ఆరోపణలు చేసింది. ఒకసారి మాల్వీని కలిసేందుకు రాజ్ ముంయి వెళ్లడాన్ని, దాన్ని తాను ప్రశ్నించానని చెప్పింది.. అప్పటి నుంచి తమ మధ్య విభేదాలు మొదలయ్యాయని లావణ్య వెల్లడించింది. అటు, లావణ్యపై రాజ్ తరుణ్ ఆరోపణలు చేశాడు. మస్తాన్ సాయి అనే వ్యక్తితో ఆమెకు శారీరక సంబంధం ఉందని ఆరోపించారు.
మరోవైపు, పోలీసుల దాఖలు చేసిన ఛార్జ్షీట్పై లావణ్య స్పందించింది. ధర్మమే గెలిచిందని, తామిద్దరం గుడిలో వివాహం చేసుకున్నామని అన్నారు. పోలీసుల ఛార్జ్షీట్పై ఆమె సంతోషం వ్యక్తం చేసింది. తమను విడగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని లావణ్య ఆరోపించారు. అయితే, తమ వివాహానికి సంబంధించిన ఫోటోలు కూడా తన వద్ద ఉన్నాయని, పెళ్లి చేసుకుని కాపురం చేశామని ఆమె వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa