ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేడారం గ్రామాన్ని సోలార్ పవర్ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 15, 2024, 10:47 PM

ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం రోజున ధర్మారం మండలంలోని మేడారం, కటికేనపెల్లిలో 33/11 సబ్ స్టేషన్ల శంకుస్థాపన మరియు ధర్మారం మార్కెట్ యార్డులో గొల్లపెల్లి,ధర్మారం,వెల్గటూర్ మండలాలకు చెందిన నూతన మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు,ఎంపీ గడ్డం వంశీ ,ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ ఛైర్మెన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి , మంత్రివర్యులకు హెలిప్యాడ్ వద్ద లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.అనంతరం నంది మేడారం వద్ద నూతనంగా నిర్మించనున్న 33/11 సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు,తదుపరి కటికెనపల్లి వద్ద నూతనంగా నిర్మించనున్న 33/11 సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.శంకుస్థాపనకు ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కీ.శే నరేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ధర్మారం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన గొల్లపల్లి,ధర్మారం,వెల్గటూర్ మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులు అయిన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం చెగ్యం భూ నిర్వాసితులకు సంబంధించి ఇటీవల లక్ష్మణ్ కుమార్ గారి చొరవతో మంజూరు అయినా 18 కోట్ల రూపాయల చెక్కును జిల్లా అధికారులతో కలిసి లబ్దిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. *ధర్మారం లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరై,నూతన  మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి మంత్రివర్యులు శ్రీధర్ బాబు ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,ఎంపి వివేక్,ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నామని,ధర్మపురి నియోజక వర్గానికి ఒక ఐటిఐ కలశాలను మంజూరు చేయాలని,అదే విధంగా పత్తిపాక రిజర్వాయర్ పనులను కూడా త్వరితగతిన ప్రారంభించాలని, చెగ్యం ముంపు బాధితులకు పరిహారం మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నమని,ఇటీవలే ముక్కట్రావ్ నిర్వాసితులకు పరిహారాన్ని మంజూరు చేయించి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని,రాని వారికి కూడా త్వరలోనే పరిహారం అందేల చూస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ..త్వరలో పత్తిపాక రిజర్వాయర్ కోసం కార్యాచరణ చేస్తామని,అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో మార్పు కోసం ముందుకు వెళ్తున్నామని,బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పొట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ పై ఆరోపణలు చేస్తున్నారనీ,సాంకేతిక జాప్యంతో రుణ మాఫీ ఆలస్యం అవుతుందనీ,నూటికి నూరుశాతం అమలు చేసి తీరుతామని, అభివృద్ధి,సంక్షేమం రెండు కళ్ళలాగ పనిచేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ..సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల అకాంక్షలను చట్టాలుగా మార్చి పాలన కొనసాగిస్తున్నామని, దశాబ్ద కాలంగా పెండింగ్ లో వున్న  ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామ ప్రజలకు 18 కోట్ల రూపాయలను అందజేశామని,రుణమాఫీ విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదనీ,రైతుల పక్షాన ఇన్స్యూరెన్స్ డబ్బులను ప్రభుత్వమే చెల్లించనుందనీ,సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా రైతులకు ఆదాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని,పైలట్ ప్రాజెక్టుగా 30 గ్రామాలకు ప్రభుత్వ ఖర్చుతో వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ పవర్ అందించనున్నామని,మేడారం గ్రామాన్ని సోలార్ పవర్ పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తున్నామని,దేశంలోనే మొదటిసారిగా 18 వేల కోట్ల రూపాయలను 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే ఈ సందర్భంగా తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa