ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. రూ.30,01,000 లక్షలకు దక్కించుకున్న శంకర్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 17, 2024, 08:34 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకత కలిగిన బాలాపూర్‌ గణేశుడి లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. స్థానికుడైన కొలను శంకర్ రెడ్డి 30 లక్షల 1000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈసారి 3.01 లక్షలు ఎక్కువగా లడ్డూకు ధర పలకడం విశేషం. వేలం అనంతరం కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు డబ్బులను అందజేశారు. రూ. 1,116తో వేలం ప్రారంభం కాగా.. పోటాపోటీగా సాగిన వేలంలో కొలను శంకర్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.


గతేడాది హైదరాబాద్ శివారు తుర్కయంజాల్‌కు చెందిన దాసరి దయానంద్ అనే వ్యక్తి 27 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నాడు. కాగా, ఈ ఏడాదితో బాలాపూర్ గణేష్‌ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. లడ్డూవేలాన్ని తొలిసారిగా 1994లో నిర్వహించారు. ఆ ఏడాది బాలాపూర్‌కే చెందిన కొలను మోహన్ రెడ్డి రూ.450కు లడ్డూ దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఏయేడాది కాయేడు రికార్డు ధరల పలుకుతూ లడ్డూ ప్రసాదం రూ.వందల నుంచి రూ.లక్షలకు చేరింది.


లడ్డూకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని తొలిసారిగా నిర్వాహకులు వేలంలో కొత్త నిబంధనను తీసుకువచ్చారు. లడ్డూ వేలంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే డబ్బును డిపాజిట్‌ చేయాలని నిబంధనను పెట్టారు. గతేడాది రూ.27 లక్షలు పలకగా.. ఆ మెుత్తాన్ని డిపాజిట్ చేసిన పలువురు భక్తులు వేలంలో పాల్గొన్నారు. పోటాపోటీగా సాగిన వేలంలో చివరకు కొలను శంక రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.


లడ్డూను ప్రధాని నరేంద్ర మోదీకి అంకితం ఇస్తున్నట్లు శంకర్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీకి పూర్తి లడ్డూను అందజేస్తానని చెప్పారు. కాగా, శంకర్ రెడ్డి స్థానిక బీజేపీ నేత. ప్రస్తుతం ఆయన సింగిల్ విండో ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో వేలంలో పాల్గొన్న ఆయన.. లడ్డూను ప్రధానికి అందజేస్తానని చెప్పారు.


బాలాపూర్‌ లడ్డూ వేలం పాటలు


► 1994- కొలను మోహన్‌రెడ్డి రూ. 450


► 1995- కొలను మోహన్‌రెడ్డి రూ. 4,500


►1996- కొలను కృష్ణారెడ్డి రూ. 18,000


►1997- కొలను కృష్ణారెడ్డి రూ. 28,000


►1998- కొలను మోహన్‌రెడ్డి రూ. 51,000


►1999- కల్లెం అంజి రెడ్డి రూ. 65,000


►2000- కల్లెం ప్రతాప్‌రెడ్డి రూ.66,000


►2001- రఘునందన్‌చారి రూ. 85,000


►2002- కందాడ మాధవరెడ్డి రూ.1,05,000


►2003- చిగిరింత బాల్‌రెడ్డిరూ.1,55,000


►2004- కొలను మోహన్‌రెడ్డి రూ. 2,01,000


►2005- ఇబ్రహీం శేఖర్‌ రూ.2,80,000


►2006- చిగిరింత తిరుపతి రెడ్డి రూ.3,00,000


►2007- రఘునందర్‌చారి రూ.4,15,000


►2008- కొలను మోహన్‌రెడ్డి రూ.5,07,000


►2009- సరిత రూ. 5,10,000


►2010- కొడాలి శ్రీధర్‌బాబు రూ.5,35,000


►2011- కొలను బ్రదర్స్‌ రూ. 5,45,000


►2012- పన్నాల గోవర్థన్‌రెడ్డి రూ.7,50,000


►2013- తీగల కృష్ణారెడ్డి రూ.9,26,000


►2014- సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి రూ.9,50,000


►2015- కొలను మదన్‌ మోహన్‌రెడ్డి రూ.10,32,000


►2016- స్కైలాబ్‌రెడ్డి రూ.14,65,000


►2017- నాగం తిరుపతిరెడ్డి రూ.15,60,000


►2018- శ్రీనివాస్‌గుప్తా రూ.16,60,000


►2019- కొలను రామిరెడ్డి రూ.17,60,000


►2020- కరోనా కారణంగా అప్పటి సీఎం కేసీఆర్‌కి అందజేశారు


►2021- రమేష్ యాదవ్, మర్రి శశాంక్‌రెడ్డి రూ. 18,90,000


►2022- వంగేటి లక్ష్మారెడ్డి 24,60, 000


►2023- దాసరి దయానంద్ రెడ్డి 27,00,000






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa