ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంజాయి మత్తులో వీరంగం సృష్టించిన యువకులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2024, 09:43 PM

హైదరాబాద్ లోని కొండాపూర్ లో షాకింగ్ ఘటన జరిగింది. మంగళవారం రాత్రి గణేష్ మండపం వద్ద మద్యం, గంజాయి సేవించి మత్తులో కత్తులు, కర్రలతో వీరంగం సృష్టించారు. కొండాపూర్ లోని హిందూ జై గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులపై దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అవ్వడంతో స్థానికులు ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. నిందితులను బంజారాహిల్స్ కు చెందిన చందు ఫైల్వాన్,రణదీప్ గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa