ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను మంత్రి పరిశీలన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2024, 10:32 PM

పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను నిరంతరాయంగా, యుద్ధ ప్రాతిపదికన చేసి పూర్తి చేయాలనీ రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సోమవారం రాత్రి మంత్రి పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు చేసే ప్రాంతంలో లైటింగ్ సరిపడేంత లేకపోవడం గమనించిన మంత్రి లైట్లు ఏర్పాటు చేసి పనులు నిరంతరాయంగా చేసి పూర్తి చేయాలనీ ఆదేశించారు. పనులు ఆశించిన మేరకు పురోగతిలో లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి సామర్థ్యం మేరకు పనులు నిర్వహించి కాల్వ పునరుద్ధరణ చేసి రైతులకు సాగునీరు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa