ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేషెంట్ బ్రెయిన్ డెడ్, ఫ్యామిలీ ముందుకొచ్చినా.. అవయవ దానం కుదరదన్న డాక్టర్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 07:27 PM

ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోతే ఆర్గాన్ డొనేషన్ చేసేలా డాక్టర్లు కుటుంబ సభ్యులను ఒప్పిస్తారు. ఇలా ఆర్గాన్ డొనేషన్ ద్వారా.. అవయవాల వైఫ్యలంతో తీవ్రంగా ఇబ్బంది పడుతోన్న ఎంతో మందికి డాక్టర్లు ప్రాణాలు పోశారు. ఒక్కో జీవనమృతుడి నుంచి సేకరించిన అవయవాల ద్వారా ఒకేసారి నలుగురైదుగురికి కొత్త జీవితం లభించిన సందర్భాలు ఎన్నో. అయితే తాజాగా ఓ బ్రెయిన్ డెత్ కేసులో.. జీవనమృతుడి కుటుంబీకులు అవయవదానం చేసేందుకు ముందుకొచ్చినా.. డాక్టర్లు అభ్యంతరం తెలిపారు.


ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లాకు చెందిన 48 ఏళ్ల వ్యక్తి ఇటీవల డెంగ్యూ జ్వరంతో హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చేరాడు. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ కారణంగా పరిస్థితి విషమించడంతో.. నాలుగు రోజులపాటు వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ పేషెంట్ బ్రెయిన్ డెడ్ అయ్యాడని డాక్టర్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని డాక్టర్లు కుటుంబ సభ్యులకు తెలిపారు.


డాక్టర్లతో మాట్లాడిన తర్వాత అవయవదానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. వెంటనే జీవన్ దాన్ టీమ్‌తో టచ్‌లోకి వెళ్లారు. అయితే జీవన్ దాన్ బృందం మాత్రం ఇలాంటి సందర్భాల్లో ఆర్గాన్ డొనేషన్ సాధ్యం కాదని చెప్పింది. వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి అవయవాలను సేకరించడం కుదరదని జీవన్ దాన్ ప్రతినిధులు తెలిపారు. గత రెండు నెలల్లో ఇదే హాస్పిటల్‌లో ఇలాంటివే రెండు కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు.


మరో ఘటనలో.. మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతూ ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో చేరాడు. అతడు బ్రెయిన్ డెడ్ అని డాక్టర్లు ప్రకటించారు. అయితే అతడికి టీబీ ఉండటంతో.. కుటుంబ సభ్యులు అవయవ దానం చేసేందుకు ముందుకొచ్చినప్పటికీ.. అధికారులు మాత్రం తిరస్కరించారు. రోగనిరోధక శక్తి తగ్గిన వారు, డెంగ్యూ, మలేరియా లాంటి వైరల్ జబ్బులతో బాధపడుతున్న వారి నుంచి అవయవాలను సేకరించలేమని ఉస్మానియా హాస్పిటల్‌లో జీవన్ దాన్ సీనియర్ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తోన్న డాక్టర్ భాను చంద్ర తెలిపారు.


ప్రస్తుతం రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా, చికన్ గన్యా, వైరల్ ఫీవర్లు ఎక్కువగా ఉండటంతో.. దాని ప్రభావం రక్తదానంపై పడుతోంది. ఇటీవలే వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కోలుకున్న వారి నుంచి రక్తం సేకరించడం కుదరదని బ్లడ్ బ్యాంకులు, రక్తదాన శిబిర నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో రక్తదానం చేసే వారి సంఖ్య తగ్గిపోగా.. అదే సమయంలో ప్లేట్‌లెట్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది, ఆరోగ్యంగా ఉన్నామని డోనర్లు అనుకోవచ్చు. కానీ వారిలో ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa