ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో అమానుష ఘటన.. ఇద్దరు బాలికలపై ఐదుగురు గ్యాంగ్ రేప్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 07:29 PM

పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలపై మృగాళ్లు సామూహిక అత్యాచారం పాల్పడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదుగురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు, వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సైదాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో ఓ ప్రయివేట్ సంస్థ.. బాలికల కోసం ఓ పునరావాస కేంద్రాన్ని నడుపుతోంది. ఈ కేంద్రంలో జనగామ ప్రాంతానికి చెందిన ఓ బాలిక (14) మూడు నెలల నుంచి ఆశ్రయం పొందుతుండగా.. గత నెల 18న మల్కాజిగిరికి చెందిన మరో బాలిక (15) చేరింది. తల్లిదండ్రులు ఉన్నా, వేర్వేరు కారణాలతో బాలికలను ఆశ్రమంలో చేర్పించారు.


ఈ క్రమంలో బాలికల మధ్య స్నేహం ఏర్పడింది. దీంతో అక్కడి నుంచి పారిపోవాలని భావించిన ఇద్దరూ సెప్టెంబరు 24న కిటికీ నుంచి దూకి తప్పించుకున్నారు. దీని గురించి సైదాబాద్ పోలీసులకు నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు. సెప్టెంబరు 24 న రాత్రి 8 గంటలకు బాలికులు ఇద్దరూ జనగామ చేరుకున్నారు. బస్టాండ్ సమీపంలో పాన్‌షాప్ నడుపుతోన్న సాయిదీప్ అనే యువకుడి దగ్గర ఫోన్ తీసుకున్న ఓ బాలిక తనకు తెలిసిన నాగరాజుకు ఫోన్ చేసింది. అక్కడకు వచ్చిన అతడు.. ఆ బాలికను ఓ గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.


తన స్నేహితురాల్ని నాగరాజు తీసుకెళ్లడంతో బస్టాండ్ దగ్గర మరో బాలిక ఒంటరిగా మిగిలింది. దీన్ని గమనించిన సాయిదీప్ ఆమెకు ఆశ్రయం కల్పిస్తానని నమ్మబలికాడు. పక్కనే ఉన్న బేకరీకి తీసుకెళ్లి.. బేకరీ నిర్వాహకుడు రాజుతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నాగరాజు తన వెంటనే తీసుకెళ్లిన బాలికను సెప్టెంబరు 25న ఉదయం తీసుకొచ్చి బస్టాండ్ దగ్గర వదిలిపెట్టాడు.


ఆ బాలికలు విషయం తెలుసుకున్న సాయిదీప్, రాజుల స్నేహితులు అఖిల్, రోహిత్లు వారిని హైదరాబాద్ తీసుకెళ్తామని నమ్మించారు. ఈ క్రమంలో కారులో ఎక్కించుకుని మార్గంమధ్యలో వారిపై పలుమార్లు అత్యాచారం చేసి తిరిగి బస్టాండ్ దగ్గరే వదిలి పరారయ్యారు. ఈ క్రమంలో బాలికలు పోలీసుల కంటబడటంతో అదే రోజు సైదాబాద్కు తీసుకొచ్చి పునరావాస కేంద్రంలో అప్పగించారు. వారికి కౌన్సెలింగ్ ఇప్పించగా.. తమపై జరిగిన లైంగిక దాడి గురించ బయటపెట్టారు. దీంతో పునరావాస కేంద్రం నిర్వాహకులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలికలు చెప్పిన వివరాలు ఆధారంగా ఐదుగురు యువకులను గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి, పోక్సో కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa