కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.దామెర మండలం దుర్గంపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు చిల్ల తిరుపతి గత జూన్ నెలలో ప్రమాదవశాత్తు అకాల మరణ చెందడం జరిగింది.వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ద్వారా మంజూరు చేయించిన రెండు లక్షల రూపాయల ప్రమాద భీమా చెక్కును ఆదివారం ఉదయం పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి హనుమకొండలోని వారి నివాసంలో తిరుపతి కుటుంబసభ్యులకు అందచేశారు.
ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ..పార్టీ కోసం అహర్నిశలు కృషిచేస్తున్న కార్యకర్తలు అకాల మరణం చెందితే ఆ కార్యకర్త కుటుంబానికి ఆర్ధిక భరోసా కల్పించేందుకే కేసీఆర్ ప్రతి కార్యకర్తకు ప్రమాద భీమా చేపించడం జరిగిందని అన్నారు.పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa