ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 08, 2024, 03:14 PM

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి వ్యక్తి అమ్మ పేరుతో ఒక చెట్టు నాటాలని యూత్ సభ్యుడు ప్రశాంత్ పిలుపునిచ్చారు.జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దట్నూర్ గ్రామంలో ఉన్న పాఠశాల ఆవరణలో నెహ్రూ యువ కేంద్రం మరియు శివాజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అమ్మ పేరుతో ఒక చెట్టు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనిత మొక్కలు నాటారు అనంతరం వారు మాట్లాడుతూ అమ్మ పేరుతో ఒక చెట్టు నాటి పర్యావరణాన్ని కాపాడాలని భూమి రక్షించి,ప్రాణాలను రక్షించండి.మన గ్రహాన్ని రక్షించండి మన భవిష్యత్తును కాపాడుకోండని నినాదాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,యూత్ సభ్యులు,దట్నూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa