హైదరాబాద్ విశ్వ నగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. నగర జనాభా కోటి దాటక.. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఇక నగర అభివృద్ధి, గ్రేటర్ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గటం లేదు. విస్తరిస్తున్న మహానగరంలో ప్రజలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు GHMC క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తోంది. వ్యూహాత్మక పథకాల ద్వారా రోడ్ల వెడల్పు, జంక్షన్ ల అభివృద్ది, సుందరీకరణ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే అనేక కొత్త రహదారులు, అండర్పాసులు, ఫ్లైఓవర్లు నిర్మించారు. మరికొన్ని నిర్మాణ దశలో ఉండగా.. త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
ఈ ఎస్ఆర్డీపీ పథకం రెండో దశలో ఆరాంఘర్- జూపార్కు వరకు శంషాబాద్ నుంచి పాతబస్తీకి సులువుగా ప్రయాణించేందుకు ప్రాజెక్టులను చేపట్టిన విషయం తెలిసిందే. దాదాపు రూ.636.80 కోట్ల వ్యయంతో ఆరాంఘర్- జూపార్కు ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. మెుత్తం 4.5 కిలోమీటర్ల అతి పెద్ద ప్లైఓవర్ నిర్మించ తలపెట్టారు. మెుత్తం 6 లైన్లతో ఈ ప్లైఓవర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే పనులు తుది దశకు చేరుకోగా.. ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తోంది. నెలాఖరులోగా మిగిలిన పెండింగ్ పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది.
హైదరాబాద్ నగరం నుంచి బెంగళూరు హైవేకు ఉన్న ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఆరాంఘర్ నుంచి జూపార్కు వరకు ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. 2021లో పనులు ప్రారంభం కాగా.. ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇక నల్గొండ క్రాస్రోడ్స్ నుంచి ఒవైసీ హాస్పిటల్ మార్గంలో స్టీల్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఈ పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి. రూ.524 కోట్లతో 3.38 కి.మీ పొడవునా నాలుగు లేన్లతో ఈ స్టీల్ బ్రిడ్జి పనులను జీహెచ్ఎంసీ చేపట్టగా.. ఈ బ్రిడ్జి కూడా అందుబాటులోకి వస్తే.. నల్గొండ, మహబూబ్ నగర్ నుంచి వచ్చే వాహనాలు ఈజీగా నగరంలోకి చేరుకోనున్నాయి. ఎటువంటి ట్రాఫిక్ రద్దీ లేకుండా దూసుకెళ్లిపోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa