ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్‌న్యూస్.. శబరిమలకు స్పెషల్ ట్రైన్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 16, 2024, 09:20 PM

తెలంగాణ నుంచి చాలా మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్తుంటారు. కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షలు చేపడతారు. 41 రోజుల పాటు కఠినమైన నియమాలు ఆచరిస్తూ నిత్యం అయ్యప్పను పూజిస్తారు. శబరిమల వెళ్లి అయ్యప్పను దర్శించుకుంటారు. కొందరు ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు ట్రావెల్స్, సొంత వాహనాల్లో స్వామి దర్శనానికి వెళ్తుంటారు. అయితే అది కొంత ఖర్చుతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే తీపి కబురు చెప్పింది. శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ట్రైన్లను నడిపించనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.


హైదరాబాద్ మౌలాలి నుంచి కేరళ కొల్లం స్టేషన్‌ వరకు నవంబరు 22, 29 తేదీల్లో రెండు స్పెషల్ ట్రైన్లు (ట్రైన్ నెంబర్ 07143) బయల్దేరుతాయని అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణం కొల్లం నుంచి మౌలాలికి నవంబరు 24, డిసెంబరు 1 తేదీల్లో ట్రైన్లు (నెంబర్ 07144) అందుబాటులో ఉంటాయన్నారు. ఈ స్పెషల్ ట్రైన్లు చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయన్నారు. ఏపీలోని మచిలీపట్నం నుంచి కొల్లంకు ట్రైన్లు (నెంబర్ 07145) నవంబరు 18, 25 తేదీల్లో, కొల్లం నుంచి మచిలీపట్నంకు ట్రైన్లు (నెంబర్ 07146) నవంబరు 20, 27 తేదీల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అయ్యప్ప భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.


సికింద్రాబాద్ టూ లక్నో స్పెషల్ ట్రైన్ఇక రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో తీపి కబురు కూడా చెప్పింది. సికింద్రాబాద్ టూ లక్నో స్పెషల్ ట్రైన్ సర్వీసును ప్రారంభిస్తున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. నవంబర్ 15న ఈ ట్రైన్ ప్రారంభం కాగా.. నవంబర్ 22న కూడా ఈ స్పెషల్ ట్రైన్ సర్వీసును నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్పెషల్ ట్రైన్ తెలంగాణతో పాటు ఏపీ మీదుగా లక్నో చేరుకుంటుందన్నారు. తెలంగాణలో నల్గొండ, మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లలో ఆగనుండగా.. ఏపీలోని గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం స్టేషన్‌లలో ట్రైన్ ఆగుతుందని అధికారులు తెలిపారు. ఇక అక్కడి నుంచి.. భువనేశ్వర్, కటక్, గయా, వారణాసి, అయోధ్య స్టేషన్లలోనూ ట్రైన్ ఆగుతూ.. లక్నో చేరుకుంటుందన్నారు. ఈ స్పెషల్ ట్రైన్‌లో 3 ఏసీ కోచ్‌లు కూడా ఉంటాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa