ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సన్న వడ్లు క్వింటాలుకు రూ.500 బోనస్..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 19, 2024, 10:20 PM

పెద్దపల్లి మండలం,రాంపెల్లి గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు సెంటర్ను సోమవారం రోజున స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు సన్న వడ్లు సాగు చేసుకున్న రైతులకు క్వింటాలుకు 500 బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వానకాల పంటకు రైతులకు క్వింటాలకు 500 బోనస్ రైతుల అకౌంట్ లో డబ్బులు జమ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు. రైతుల ఖాతాలో బోనస్ పడుతున్న కూడా ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. రైతుల ఖాతాలో బోనస్ పడడం ప్రారంభమైందని రైతులెవరు అదేర్య పడవద్దని సన్నవడ్లు సాగు చేసుకున్న ప్రతి ఒక్కరికి బోనస్ అందుతుందన్నారు.
రానున్న యాసంగి సాగుకు అనురాధ కార్తెలో నార్లు పోయాలని, తద్వారా అనుకూల వాతావరణంలో పంట చేతికి వస్తుందని అన్నారు. యాసంగిలో తెగుళ్లను తట్టుకునే వరి రకాలను సాగు చేసుకోవాలని రైతులకు వివరించారు.రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని అలాగే ఎలాంటి వడ్ల కటింగ్ లు లేకుండా ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత తనది అన్నారు. ప్రతి గింజకు మద్దతు ధర చెల్లించి వడ్లను కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పారు. నాణ్యమైన నిర్ణీత మ్యాచరు 17 తో కూడిన వడ్లను తీసుకువచ్చే బాధ్యత రైతులదని అన్నారు. సెంటర్లలో వడ్లను కాంట వేసిన అనంతరం రైతులు రసీదులు కొంది నిరంధిగా వెళ్లవచ్చని పేర్కొన్నారు. సెంటర్ల ఇన్చార్జిలు ఏలాంటి తేడాలు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. రైతులకు ఎక్కడ మోసం జరిగినా సహించేది చేసేది లేదని స్పష్టం చేశారు. గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు వడ్ల కటింగ్ పేరిట రైతులను నిలువునా ముంచారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు వల్ల వడ్ల కటింగ్ లకు స్థానం లేకుండా చేశామని చెప్పారు. ప్రజల ఆశీర్వాదం తమకు ఉన్నంతకాలం ఇదే పద్ధతిని కొనసాగిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ రామిడి నర్సింహా రెడ్డి, సంపత్ రావు,మాజీ సర్పంచ్ కనపర్తి ప్రభాకర్ రావు,గన్నమానేని తిరుపతి రావు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు,అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa