ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-3 పరీక్షలు: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 19, 2024, 10:33 PM

పెద్దపల్లి: గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా  ముగిశాయని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  సుల్తానాబాద్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలలో జరుగుతున్న గ్రూప్ 3 పరీక్షలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, పెద్దపెల్లి జిల్లాలో మొత్తం 8 వేల 947 మంది అభ్యర్థులకు 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా ఆదివారం ఉదయం జరిగిన మొదటి పేపర్ పరీక్షకు 4557 మంది అభ్యర్థులు హాజరు కాగా, 4390 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 4440 మంది అభ్యర్థులు హాజరు కాగా, 4507 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని, సోమవారం ఉదయం మూడో పేపరు పరీక్షకు 4514 మంది అభ్యర్థులు హాజరు కాగా, 4433 మంది అభ్యర్థులు గైరహాజరయ్యారని ,  జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ  పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు, తదితరులు  పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa