అజాగ్రత్తగా అతివేగంగా ఆటో నడుపుతూ అదుపుతప్పి చెట్టుకు ఢీకొని ఆటో డ్రైవర్ మృతి చెందిన సంఘటన రాయపోల్ మండలం వడ్డేపల్లి గుర్రాలసోపా చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. రాయపోల్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ కు చెందిన బిల్లివాల చంద్రకాంత్ (36) ఆటోడ్రైవర్ గా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
నిజామాబాద్ నుంచి మంగళవారం ఉదయం తన ఆటో నెం టీఎస్ 16 యూఏ 8626 వాహనంలో వారి చెల్లె వద్దకు రాంసాగర్ గ్రామానికి వచ్చి చూసి తిరిగి సాయంత్రం 6.30 గంటలకు నిజామాబాద్ ఇంటికి వెళ్లడానికి పోయే క్రమంలో మార్గమధ్యంలో గుర్రాలసోఫా సమీపంలో గజ్వేల్-చేగుంట రోడ్డు మార్గంలో తన ఆటోను అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి మూలమలుపు వద్ద రోడ్డుకు కుడివైపు రోడ్డు క్రిందికి వెళ్లి చెట్టుకు బలంగా ఢీ కొట్టాడు. ఆ ప్రమాదంలో అతని తలకు బలమైన గాయమైంది. అదే సమయంలో అక్కడ నుంచి వెళ్తున్న రాంసాగర్ గ్రామస్తులు చూసి అతని బావకు సమాచారం ఇవ్వగా వారు వెంబడే సంఘటన స్థలానికి వచ్చి చంద్రకాంత్ ను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాయపోల్ ఎస్ఐ రఘుపతి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa