వికారాబాద్ జిల్లా వామపక్ష పార్టీల రాష్ట్ర కమిటీలా పిలుపులో భాగంగా గురువారం చలో లాగాచర్ల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,తో సిపిఎం, వామ పక్షాల రాష్ట్ర నాయకులు శ్రేణులు పాల్గొంటున్నారు.జిల్లా లోని ప్రజాసంఘాల నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని నేడు జిల్లా కమిటీ సమావేశం పిలుపునివ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ వెంకట రాములు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మా పేరుతో కొడంగల్ ప్రాంతంలోని లగచర్ల రోటి రోటి బండ తండా హకీంపేట్ పోలేపల్లి తదితర తండాలో గ్రామాలలో వేలాది ఎకరాలు ఫార్మ పేరుతో ప్రభుత్వం భూమి సేకరిస్తుంది పేదలను ఇబ్బందుల గురిచేస్తూ అక్రమ కేసులు పెట్టి జైల్ లలో పోలీస్ స్టేషన్లో నిర్భoదిచడం సరి కాదు. దీన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం పేదలను ఇబ్బందులు పెడుతూ భూములు తీసుకోవడం అన్యాయం. 2013 యాక్ట్ ప్రకారం పేదలకు గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రైతులపై గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులు తొలగించాలని గురువారం చలో లాగచర్లకు జిల్లాలో ఉన్నటువంటి పేదలు గిరిజనులు వామాపక్ష పార్టీల నాయకులు అందరు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జిల్లా నాయకులు వెంకటయ్య శ్రీనివాస్ చంద్రయ్య సతీష్ నవీన్ సుదర్శన్ నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa