పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం దగ్గర విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 27న జరిగే తెలంగాణ ఉద్యమకారుల విజయ సంకల్ప మహా పాదయాత్రను విజయవంతం చేయాలని , తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కరీంనగర్ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు.అనంతరం వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మొక్కులు సమర్పించడం జరుగుతుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , జిల్లా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు , పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు , రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ , ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ నేతృతంలో ఉద్యమకారుల సంక్షేమాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఉద్యమ నాయకుడు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఇటీవలే ముఖ్యమంత్రి కి లేఖ రాసారని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న పొన్నం ప్రభాకర్ కి ఉద్యమకారుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.కావున ఈ యొక్క పాదయాత్రలో ప్రతి తెలంగాణ తొలి , మాలి దశ ఉద్యమకారులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో దబ్బెడ చంద్రకళ , పోతు జోతి రెడ్డి , పిడుగు కృష్ణ , తదూరి శ్రీమాన్ , కందుల సదాశివ , బింగి రాజు , లలిత ఠాగూర్ , కర్నాటి సీతక్క , అక్క పాక లక్ష్మి , కళావతి , హరిత , బూర్ల ధనంజయ్ , మారం మల్లేశం , మద్దెల సంజీవ్ , మూల మల్లేశం , గట్టు సమ్మయ్య , పెంచల మల్లయ్య , భాస్కర్ , శ్రీనివాస్ , తిరుపతి , వీరేశం , రౌతు సందీప్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa