సిద్ధిపేట జిల్లా అవుసులోనిపల్లిలో సిద్దిపేట టాస్క్ ఫోర్స్ మరియు గౌరారం పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. అవుసులోనిపల్లిలోని ఓ వ్యక్తి ఇంట్లో కొందరు పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు, పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ. 36, 860 నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa