ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మృతుని కుటుంబానికి అండగా రాష్ట్ర యువజన నాయకుడు రణధీర్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 26, 2024, 08:16 PM

ఆత్మకూరు మండలంలోని పెంచికలపేట గ్రామానికి చెందిన  కోటగిరి మల్లయ్య గౌడ్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా విషయం తెలుసుకున్న రాష్ట్ర యువజన నాయకులు రేవూరి రణధీర్ రెడ్డి మృతుడు కోటగిరి మల్లయ్య గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా రణధర్ రెడ్డి మాట్లాడుతూ  మృతుని కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, తన వంతు సహాయం కూడా  ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ నాయకులు రణధీర్ రెడ్డి వెంట కాంగ్రెస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు కుండే కృష్ణంరాజు, వెన్నపురెడ్డి నాగరాజు, మండల పార్టీ యూత్ కార్యదర్శి మంగరాజు, అసెంబ్లీ యూత్ కార్యదర్శి కొమ్ముల శ్రవణ్,కుండే మహేందర్, కమలాకర్ రెడ్డి, దురిశెట్టి శ్రవణ్, ఇలసారపు చంద్రమౌళి, సుద్దాల అనిల్, ఉప్పుగళ్ళ రాజు, బయ్యగాని శివ, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa