ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సికింద్రాబాద్-నాగపూర్ వందే భారత్ ట్రైన్.. సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 27, 2024, 07:40 PM

హైదరాబాద్ నగరం నుంచి వివిధ ప్రాంతాలకు చాలా మంది ట్రైన్ జర్నీలు చేస్తుంటారు. ఇక పొరుగున్న ఉన్న ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు చాలా మంది రాకపోకలు సాగిస్తుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు చేసేవారు నిత్యం ప్రయాణాలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ట్రైన్ కనెక్టివిటీ పెంచాలని భావించిన సౌత్ సెంట్రల్ రైల్వే.. హైదరాబాద్ నుంచి విశాఖ, తిరుపతి, బెంగళూరులతో పాటుగా నాగ్‌పుర్ నగరానికి కూడా వందే భారత్ ట్రైన్లు తీసుకొచ్చింది. విశాఖ, తిరుపతి, బెంగళూరులకు చాలా నెలల క్రితమే ట్రైన్లు అందుబాటులోకి రాగా.. సికింద్రాబాద్-నాగపూర్ ట్రైన్ మాత్రం సెప్టెంబర్ 16న ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ట్రైన్ ప్రారంభించారు.


 అయితే ఈ ట్రైన్‌లో ఆశించినంతగా ఆక్యుపెన్సీ ఉండటం లేదని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు గుర్తించారు. మెుత్తం 20 బోగీలతో ఈ ట్రైన్ నడుస్తుండగా.. సగం సీట్లు కూడా నిండటం లేదు. ట్రైన్‌లో దాదాపుగా అన్ని కోచ్‌లు ఖాళీగానే ఉంటున్నాయి. ట్రైన్ ప్రారంభం అయిన నాటి నుంచి రద్దీ ఉండటం లేదు. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య వాణిజ్యపరంగా ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి ఈ కొత్త వందే భారత్ ట్రైన్ ఏర్పాటును నడుపుతున్నారు. మహారాష్ట్రలోని విదర్భ, తెలంగాణలోని రామగుండం, కాజీపేట, సికింద్రాబాద్ పారిశ్రామిక కారిడార్లను కనెక్ట్ ఈ ట్రైన్ ఉపయోగపడుతుందని భావించారు. కానీ ఈ ట్రైన్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి 80 శాతం కూడా నిండటం లేదు.


ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ ట్రైన్ బోగీల సంఖ్యను తగ్గించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. 20 బోగీలతో ట్రైన్ నడుస్తుండగా.. 10 బోగీలకు పరిమితం చేయాలని యోచిస్తున్నారట. నాగ్‌పుర్‌ ట్రైన్‌ 10 కోచ్‌లు తగ్గించి అదనంగా ఉన్న బోగీలను సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖ, కాచిగూడ-యశ్వంతపూర ట్రైన్లకు కలపాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఏ వందేభారత్‌ ట్రైన్లకు ఎన్ని బోగీలు కలపాలన్న విషయంపై సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఫోకస్ పెట్టినట్లు సమాచారం. దాంతో పాటు టైమింగ్‌ కూడా మార్చాలని యోచిస్తున్నారట. ప్రస్తుతం ఈ ట్రైన్ నాగ్‌పూర్ నుంచి తెల్లవారుజామున 5 గంటలకు సికింద్రాబాద్‌కు బయల్దేరుతుండగా... దీన్ని ఉదయం 7 గంటలకు మార్చాలని అధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa