ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేవెళ్ళ ప్రాంత ప్రజలతో ధర్నాకు దిగిన పట్లోళ్ల కార్తీక్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 03, 2024, 06:39 PM

సోమవారం సాయంత్రం చేవెళ్ల మండలం.. ఆలూరు స్టేజ్ వద్ద.. అదుపు తప్పిన లారీ కూరగాయల వ్యాపారుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో 10 మందికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే.అయితే ఈ ఘటనకు కారణం రోడ్డు పనులు ప్రారంభించ లేకపోవడమే అని, తాను చాలా రోజులుగా ఇదే సమస్యలపై పోరాటం చేస్తున్ననని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే ఈ రోజు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లైన్ల రోడ్డు మంజూరై ఏడాదిన్నర గడిచిందని.. వెంటనే రోడ్డు విస్తరణ పనులు మొదలు పెట్టాలని గ్రామస్థులతో కలసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు పనులకు అనుమతి ఇస్తే సరే.. లేదంటే చెట్లను మేమే నరికేస్తామని, ప్రజాస్వామ్యంలో కోర్టులు ప్రజా సమస్యల కోసం ఉండాలని.. చెట్లు, జంతువులు మనుషుల తర్వాతే రావాలని అన్నారు.అలాగే మనుషుల ప్రాణాలు తీసే కోర్టులు ఎవరికి అవసరం లేదని.. చేవెళ్లలో రోడ్డు ప్రమాదాల్లో చాలా మందిచనిపోతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు ఎన్జీటీ(NGT)కి నివేదిక ఇవ్వాలని, మనిషి ప్రాణాల కంటే చెట్లు ఏమీ ముఖ్యం కాదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మా బాధను అర్థం చేసుకొని NGT వాళ్ళు రోడ్డు పనులకు అనుమతి ఇస్తే సరే.. లేదంటే చెట్లను మేమే నరికేస్తామని ఈ సందర్భంగా పట్లోళ్ల కార్తీక్ రెడ్డి డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa