గురువారం రోజు నల్లగొండ పట్టణ కేంద్రంలోని టీఎన్జీవో భవన్ లో జర్నలిస్టులకు నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్, మలక్ పేట వారి సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పత్రికా రంగంలో పనిచేయడమే కాకుండా సోషల్ సర్వీస్ లో కూడా తమ వంతు పాత్ర ఉందని నిరూపిస్తూ ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని తమ సమస్యలను పరిష్కారానికి కొత్తగా ప్రెస్ క్లబ్ కూడా ఏర్పాటు చేసుకున్నారని సమస్యల పరిష్కారానికి తమ వంతు సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రసారాలు మాధ్యమాలైనటువంటి ప్రింట్ ,ఎలక్ట్రానిక్ మీడియా, వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి వాటిని సరిదిద్దవలసిన బాధ్యత కూడా పత్రికా రంగానికి ఉందని వాటి నీ ప్రజా ప్రతినిధులు స్వాగతించవలసిన అవసరం ఉందని పత్రికలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులని తెలిపారు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వై చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చిన్న పత్రికలు ,పెద్ద పత్రికలు ,ఉర్దూ పత్రికలు ,ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అనే తేడాలు లేకుండా అందరి సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
జర్నలిస్టు మిత్రులకు కార్తీక వనభాజనాలు కూడా ఏర్పాటు చేశామని జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈ క్యాంపు ఏర్పాటు చేసుకున్నామని దీని యొక్క ముఖ్య ఉద్దేశం జర్నలిస్టులు పని ఒత్తిడికి గురికావడం జరుగుతుందని వ్యక్తిగత జీవితం పై శ్రద్ధ చూపకపోవడంతో అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్న దృశ్య హెల్త్ క్యాంపు ని నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈరోజు హెల్త్ క్యాంపులో దాదాపుగా 500 మంది జర్నలిస్టుల వారి కుటుంబ సభ్యులు వినియోగించుకున్నారని తెలిపారుఈ కార్యక్రమం లో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు జి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాస్ రెడ్డి, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, జర్నలిస్టులు వారికి కుటుంబ సభ్యులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa