ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో ఈ నెల 9న బంద్.. కాలేజీలు, స్కూళ్లు, షాపులు మూసివేయాలని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 06, 2024, 07:12 PM

తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.. ఈ నెల 9న బంద్ పాటించాలంటూ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ లేఖను విడుదల చేశారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక సమీప అడవుల్లోని పోకలమ్మ వాగు దగ్గర జరిగిన పాశవిక హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన తన పేరుతో మీడియాకు గురువారం లేఖను విడుదల చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 9వ తేదీన తెలంగాణలో బంద్‌ పాటించాలని పిలుపునిచ్చారు. నవంబర్‌ 30న చెల్పాక పంచాయతీలోని ఓ వలస ఆదివాసీ గ్రామంలో ఏడుగురు సాయుధులను అధీనంలోకి తీసుకుని దగ్గరి నుంచి అతి కిరాతకంగా కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ ఘటనకు కాంగ్రెస్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాలి అన్నారు.


'ద్రోహి ఇచ్చిన సమాచారంతో డిసెంబర్‌ 1వ తేదీన ములుగు జిల్లా. ఏటూర్‌ నాగారం మండలం, చెల్పాక గ్రామ పంచాయితీ అడవుల్లో పోల్‌ కమ్మ వాగు వద్ద తెలంగాణ గ్రేహౌండ్స్‌ పోలీసులు ఏడుగురి విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతంగా చంపారు. నవంబర్‌ 30వ తేదీ సాయంత్రం ఏడుగురితో వున్న మా దళం చల్చాక పంచాయితీలో ఉన్న వలస ఆదివాసీ గ్రామాన్ని కలిసి నమ్మిన వ్యక్తికి తినడానికి భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పారు. ముందుగానే పోలీసులకు అప్రోవర్‌‌గా మారిన ఇన్ఫార్మర్ ద్వారా భోజనంలో విషం ఇచ్చి స్పృృహం కోల్పోయే లాగా చేశారు. స్పృహా కోల్పోయిన కామ్రేడ్స్‌‌ను పట్టుకుని చిత్రహింసలు పెట్టి తెల్లవారుజామున 4 గంటలకు అతి సమీపం నుండి కాల్చి చంపారు. శత్రువు మోస పూరిత పథకంలో చిక్కి అమూల్యమైన కామ్రేడ్స్‌ కురుసం మంగు అలియాస్ పాపన్న, బద్రు (తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు), ఏగోలపు మల్లయ్య అలియాస్ మధు, కోటి (జెఎండబ్యూపీ డివిజన్‌ కమిటీ సభ్యుడు), ముచాకీ అందాల్‌ అలియాస్ కరుణాకర్‌ (ఇల్లెందు-నర్సంపేట్‌ ఏరియా కమిటీ సభ్యుడు), ముచాకీ బూమే అలియాస్ జమున (ఏరియా కమిటీ సభ్యురాలు ), పూనెం చోటు అలియాస్ కిషోర్ (రీజినల్‌ కంపెనీ -2 మొదటి ప్లటూన్‌ పార్టీ కమిటి సభ్యుడు), కర్టం కామాల్‌ (రీజినల్‌ కంపెనీ-2లోని రెండవ ప్లటూన్‌ నభ్యుడు), కామ్రేడ్ జైసింగ్‌ (ఏటూర్‌ నాగారం-మహదేవ్‌ పూర్‌ ఏరియా దళం నభ్యుడు)లు ప్రాణాలర్పించారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరకులకు పేరు పేరున తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తుంది'అన్నారు.


'కాంగ్రెస్‌ ప్రభుత్వం జరిపిన పాశవిక హత్యకాండను తీవ్రంగా ఖండిస్తూ డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్త బంద్‌ కు పిలుపునిస్తున్నది. యావత్‌ పీడత ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విద్యాలయాలు, తదితర వ్యాపార సంస్థలు బంద్‌ను పాటించి జయప్రదం చేయాలని కోరుతున్నది. ఈ ఘటనకు కాంగ్రెస్‌ ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పూర్తి బాధ్యత వహించాలి. ఘటనపై న్యాయ విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేట్లకు అత్యంత విశ్వాసంగా కొమ్ముకాస్తుంది. వారి లాభాల కోసమే దోపీడీ విధానాలను అమలు చేస్తున్నది. అందులో భాగంగానే ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డంకిగా మారిన ప్రజా ఉద్యమాలను అణిచివేయడానికి ప్రజా పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీని, పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్‌ కగార్‌‌ను కొనసాగిస్తున్నారు. దామెరతోగు, రఘునాథపాలెం, పోల్‌ కమ్మ వాగు వంటి వరుస ఎన్‌ కౌంటర్ల పేరుతో హత్యలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కొనసాగిస్తున్న ఈ పాశవిక దాడులను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాము' అంటూ లేఖను విడుదల చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa