తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల గణన సర్వేకు ప్రతి ఒక్కరు సర్వేకు సహకరించి, సర్వే చేయించుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. ఈరోజు కుల గణన సమగ్ర సర్వేలో భాగంగా వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, మున్సిపల్ సిబ్బంది.. చైర్ పర్సన్ గారి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ దంపతులు స్వయంగా తమ కుటుంబ సమగ్ర వివరాలను వ్రాయడం జరిగింది.
అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సర్వే తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల మేరకు వికారాబాద్ మున్సిపల్ లో ఇప్పటికే దాదాపు 95% పూర్తి అయింది అన్నారు. కొందరు అక్కడక్కడ ఇండ్లకు తాళం ఉండడం, అందుబాటులో లేకపోవడంతో మిస్ అయ్యారని అధికారులు చెబుతున్నారు. వారు కూడా సర్వేలో పాల్గొని, ఎన్యుమరేటర్లకు సహకరించాలని తెలిపారు. ఈ సర్వే ద్వారా భవిష్యత్తులో రాబోయే సంక్షేమ పథకాలకు అర్హులు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాకిర్ అహ్మద్, ఏఈ అనిల్, ఆర్వో కృపాకర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఏసు, పట్టణ సమన్వయ అధికారి వెంకటేష్, ఆర్ఐ లక్ష్మయ్య, సీనియర్ అసిస్టెంట్లు వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, ప్రీతిక, శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్లు ముకుంద, రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa