తెలంగాణ అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు హాట్ హాట్గా సాగాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో ఇవాళ ఉదయం ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు రెండు సభల్లోనూ సమాధానాలు ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో అసెంబ్లీలో ఇంట్రెస్టింగ్ సీన్ చోటు చేసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరో మంత్రి కోమటిరెడ్డిని బావ గారు అని సంభోదించారు. ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటుగా, పలువురు ఎమ్మెల్యేలు తెలంగాణలో కొత్త డివిజన్లు, మండలాల ఏర్పాటు గురించి ప్రస్తావించారు.
దీంతో సంబంధిత మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యుల వినతులకు బదులిచ్చారు. ప్రజల ఆశలకు అనుగుణంగా తెలంగాణలో కొత్త మండలాలు, డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గౌరవ సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటుగా.. సహచర మంత్రి, బావ గారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు ఈ అంశాన్ని అథరైజ్ చేశారని తప్పకుండా వాటిని పరిశీలిస్తామని పొంగులేటి చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో కొత్త మండలాలు, డివిజన్ల ఏర్పాటుకు కృషి చేస్తామని వెల్లడించారు. కాగా, కోమటిరెడ్డిని మంత్రి పొంగులేటి బావ గారు అని సంభోధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పలువురు కాంగ్రెస్ అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ.. బావా-బావమరదుల ఆత్మీయత అని కామెంట్లు పెడుతున్నారు.
మూడు బిల్లులకు శాసనసభ ఆమోదంఇక శాసనసభలో ఇవాళ మూడు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లుకు, విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసన మధ్యే స్పీకర్ బిల్లులకు ఆమోదం తెలిపారు. శాసన సభలో ఎలాంటి చర్చ లేకుండానే మూడు బిల్లులకు ఆమోదం తెలిపారు. పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ అనంతరం సభను రేపు ఉదయం 10 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa