ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోరుకన్నా, ఊరే ముఖ్యమంటున్న పోలీస్ అధికారులు....

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 19, 2024, 02:06 PM

పెంచికలపేట్ ఎస్సై కొమరయ్య మాట్లాడుతూ, పోరుకంటే ఊరు మిన్న అని, నక్సలిజంలో పనిచేస్తున్న వారిని మీమీ ఊర్లకు తిరిగి వచ్చి, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని పెంచికలపేట్ ఎస్సై కొమరయ్య అన్నారు. నక్సలిజంలో చేరిన వారి కుటుంబాలకు, మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు, తెలియజేశారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఎస్సై కొమురయ్య నిత్యవసర సరుకులను అందజేశారు.
చౌదరి అంకుబాయ్, అనితక్క, వనితక్క, గోపన్న,తో పాటు, నక్సల్స్ లో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. పోలీస్ సిబ్బంది బందోబస్తుగా ఉంది కాబట్టి మీరు ఎట్లా కూడా తప్పించుకోలేరని, మీమీ ఇల్లకు చేరుకుని, మీ మీ కుటుంబ సభ్యులతో కలిసి, పిల్లల సుఖ సంతోషాలు, బాగోగులు  చూసుకొనండని, పెంచికల్ పేట్ ఎస్సై కోరారు. ఈ విషయంలో  పెంచికల్ పేట్ ఎస్సై, కొమరయ్య, చొరవతో కాగజ్నగర్ డిఎస్పి,తో సీఐ ఆయా పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్ఐలు, కానిస్టేబులతో పాటు తదితరులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa